పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `రాధే శ్యామ్`. ఈ చిత్రంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. కృష్ణంరాజు ఓ కీలకపాత్ర పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మితమైన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. రాధే శ్యామ్పై మేకర్స్ తాజాగా బిగ్ అప్డేట్ ఇచ్చి ప్రభాస్ ఫ్యాన్స్ను ఫుల్ ఖుషీ చేశారు. అసలు విషయం ఏంటంటే.. ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ రోజు ఉదయం 11:16 నిమిషాలకు రాధేశ్యామ్ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఆకట్టుకుంటున్న ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. కాగా, ఇటలీ బ్యాక్ డ్రాప్లో పునర్జన్మల నేపథ్యంలోనే రూపుద్దికున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.