మహాసముద్రం ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ గా వచ్చే స్టార్ హీరో ఎవరంటే..!

శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అదితి రావు హైదరి, అను ఇమ్మానియేల్ హీరోయిన్లుగా ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా మహాసముద్రం. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.

ఈ మూవీ అక్టోబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ఈ సినిమా మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాలు ముమ్మరంగా చేపడుతున్నారు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 9వ తేదీన హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో జరగనుంది. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

ముందుగా ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని మేకర్స్ ప్లాన్ చేయగా.. ఆయన అంతకు ముందే రాఘవేంద్ర రావు పెళ్లి సందడి సినిమా ఈవెంట్ కు హాజరవుతానని మాటివ్వడంతో చిత్ర నిర్మాత అనిల్ సుంకర పవన్ కళ్యాణ్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఆ కార్యక్రమానికి వచ్చే హైపే వేరుగా ఉంటుంది.

అందువల్లే ఆయనను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించినట్లు సమాచారం. ఇప్పటికే రిపబ్లిక్ మూవీ ఫంక్షన్ కి వచ్చి సందడి చేసిన పవన్ కళ్యాణ్ మరో సారి ఇంకో ఈవెంట్ కు హాజరవుతున్నట్లు వార్తలు వస్తుండడంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.