నయనతార విఘ్నేశ్ నిర్మాతలుగా మరో కొత్త సినిమా?

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి, అలాగే విగ్నేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గత నాలుగేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న నయనతార,విఘ్నేశ్‌లు ఇటీవలె నిశ్చితార్ధం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఈ జంట త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. దీనికి సంబంధించి అతి త్వరలోనే ముహూర్తం తేదీ ప్రకటిస్తామని వెల్లడించారు. ఇది ఇలా ఉంటే నయనతార తన ప్రియుడు విఘ్నేష్‌ తో కలిసి రౌడీ పిక్చర్స్‌ నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయంమన అందరికి తెలిసిందే. ఈ సంస్థలో నిర్మించిన కూళాంగళ్, రాఖీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

అయితే తాజాగా వీరు మరొక చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యారు. దీనికి ఊర్‌ కురువి అనే టైటిల్‌ నిర్ణయించారు. ఇందులో బిగ్‌బాస్‌ ఫేమ్‌ కవిన్‌ కథానాయకుడిగా నటించనున్నారు. ఈయన హీరోగా నటించిన లిప్టు చిత్రం ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదలై మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.ఈ సినిమాతో అరుణ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్ర వివరాలను నిర్మాత విఘ్నేష్‌ శివన్‌ విజయదశమి సందర్భంగా మీడియాకు వెల్లడించారు. అరుణ్‌ తన వద్ద తానా సేంద కూట్టం చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేశాడన్నారు.