ప్రతి సంవత్సరం ఇచ్చే నోబెల్ శాంతి పురస్కారాల గురించి మన అందరికి తెలిసిందే.ఈ పురస్కారాన్ని ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు కారకులు అయిన వ్యక్తులు,ఆయా సంస్ధలు చేసిన కృషిని గుర్తించి ఈ నోబెల్ శాంతి పురస్కారాలను వారికి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది.అలాగే 2021వ సంవత్సరంకు గాను నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈరోజు నోబుల్ శాంతి పురస్కారం యొక్క విజేతలను ప్రకటించింది. ఈ పురస్కారాలకు మరియా రెస్సా, దిమిత్రి మరటోవ్ ఎంపికైనట్లు తెలుస్తుంది.
దిమిత్రి మరటోవ్ ఒక రష్యన్ జర్నలిస్ట్ అలాగే నోవాయా గజెటా వార్తాపత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్ గా కూడా పనిచేస్తున్నారు. అలాగే మరియా రెస్సా ఫిలిప్పినో-అమెరికన్ జర్నలిస్ట్ రచయిత, రాప్లర్ సహ వ్యవస్థాపకురాలు, సీఈఓ కూడా. ప్రజాస్వామ్యానికి ముఖ్యం అయిన భావ వ్యక్తీకరణ, స్వేచ్ఛ పరిరక్షణ కోసం వీరు చేసిన కృషికి గానూ వీరికి ఈ విశిష్ట పురస్కారం అందచేయనున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. !