మృతుల దిబ్బగా మారిన ఆఫ్ఘనిస్తాన్ మసీద్..వీడియో వైరల్..!

ఆఫ్ఘనిస్తాన్ లోని కుందుజ్ ప్రావిన్స్ లో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. దీంతో షియా తెగకు చెందిన ముస్లింస్ సుమారుగా 100 మంది పైగా మరణించారు. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. మసీదులు వందల మంది శుక్రవారం ప్రార్థనలో ఉండగా.. ముష్కరులు బాంబు పేలుడుకు పాల్పడ్డారని ఆఫ్ఘనిస్తాన్ పోలీసులు తెలియజేశారు.

ఈ ఘటనలో గాయాలపాలైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇక ఇప్పటి వరకు ఈ సంఘటన ఎవరు చేశారనే విషయం ఇంకా ప్రకటించలేదు. పేలుడు తరువాత మసీదులో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా దృశ్యాలను సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాయి.

ఇక ఇక ఈ విషయాన్ని తాలిబన్లు అధికార ప్రతినిధి జబిల్హల్ల మహజెద్ ధ్రువీకరించాడు. ఇక ఈ ఘటనపై తాలిబన్ ఫోర్సెస్ పూర్తిగా దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఇక ఈ మధ్య కాలంలో తాలిబన్లు ఆఫ్గాన్ ను సొంతం చేసుకున్న తరువాత ఈ ఐఎస్ ఉగ్రవాదులే ఈ దాడిని కూడా చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.