మా ఎన్నికలపై.. హీరోయిన్ జెనీలియా ఏమన్నదంటే..?

మా ఎన్నికలలో మరో మూడు గంటలలో ముగియనున్నాయి. ఇదే నేపథ్యంలో ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ కొనసాగుతూనే ఉంది సీనియర్ నటులు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుని వెళ్తున్నారు. దీంతో ఇరువురు పోటీ అభ్యర్థులకు చాలా ఉత్సాహంగా ఉన్నది. ఇక ఇదే తంతు లో ముంబై నుంచి వచ్చే హీరోయిన్ జెనీలియా హైదరాబాద్ కి చేరుకొని ఓటింగ్ లో పాల్గొంది.

ఇక ఓటింగ్ ప్రాంతంలో తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. దాంతో పాటు అందరి అభినందనలు కూడా పొందింది ముద్దుగుమ్మ. మొదట జెనీలియా ను మంచు విష్ణు గ్రాండ్ గా రిసీవ్ చేసుకున్నారు. ఓటు వేసి వచ్చాక జెనీలియా మాట్లాడుతూ మా అసోసియేషన్ కు సూపర్ ప్రెసిడెంట్ రానున్నారని చెప్పి మరింత ఆసక్తిని పెంచింది. ఇక అదే విధంగా రోజా కూడా ఈ ప్రాంతానికి చేరుకొని ఓటు హక్కు వినియోగించుకుంది. ఎన్నడూలేని ఈ విధంగా ఈ మా ఎలక్షన్లు ఈసారి ఇలా నెలకొనడం చాలా బాధాకరంగా ఉందని తెలియజేసింది రోజా. ఎవరికి ఎవరు శత్రువులు కాదు అందరూ ఒకటే అని తేల్చి చెప్పేసింది.