గత కొంత కాలం నుంచీ సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటన్నాయి. సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఈ లోకాన్ని విడిచి వెళ్తుండటం తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. తాజాగా ప్రముఖ కన్నడ హాస్యనటుడు శంకర్ రావు సోమవారం ఉదయం బెంగళూరుతో మృతి చెందారు.
ఆయన వయసు 88 సంవత్సరాలు. గత కొంత కాలం నుంచీ పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన..స్వగృహంలోనే తుది శ్వాస విడిచారు. పాప పాండు సీరియల్ ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన శంకర్ రావు.. నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. రంగభూమి కళాకారునిగా కూడా ఆయన మంచి పేరు ఉంది.
అలాగే మూడు దశాబ్దాల నుంచీ ప్రముఖ హీరోల పక్కన వందకు పైగా కన్నడ సినిమాల్లో నటించారాయన. అటువంటి వ్యక్తి మృతి చెందడంతో.. కన్నడ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే కొందరు సినీ ప్రముఖులు.. శంకర్ రావు మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.