సౌత్ సౌపర్ స్టార్ రజనీకాంత్ అంటే తెలియని వారుండరు. నటుడుగా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించిన రజనీ.. ప్రేక్షకుల మదిలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. అలాగే కోట్లాది మంది ప్రేక్షకులను తన అభిమానులగా మార్చుకున్న ఈయన.. ఏదు పదుల వయసులోనూ బ్యాక్ టు బ్యూక్ సినిమా చేస్తూ కోట్ల రూపాయల ఆస్తిని కూడబెట్టారు.
అయితే ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తిని తన పిల్లలకు రాయలేదని మీకు తెలుసా? అవును, మరణానంతరం తన ఆస్తి మొత్తాన్ని పేద ప్రజలకు దక్కేలని రజనీ నిర్ణయించుకున్నారట. ఈ మేరకు వీలునామా సైతం ఇప్పటికే పొందుపర్చారట.
జనాల నుంచి తాను సంపాదిస్తున్న డబ్బు మళ్లీ జనాలకే అందివ్వాలనే మంచి సంకల్పంతోనే రజనీ ఆ నిర్ణయం తీసుకున్నారట. రజనీ నిర్ణయం పట్ల ఆయన కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్యలు సైతం ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారట. కాగా, ఇప్పటికే రజనీ తాను సంపాదించే డబ్బులో సగానికి పైగా డబ్బులు రకరకాల ఛారిటీ పనులకు వినియోగిస్తున్న విజయం విధితమే.