ఏపీలో అత్యంత భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు..ఇద్ద‌రు మృతి!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది.

గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు వెయ్యికి లోపుగా న‌మోదు అవుతుండ‌గా.. నిన్న మ‌రింత భారీగా దిగొచ్చాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 310 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో అత్య‌ధికంగా గుంటూరు జిల్లాలో 54 కేసులు న‌మోదు కాగా.. అతి స్వ‌ల్పంగా అనంతపురం జిల్లాలో 2 కేసులు న‌మోద‌య్యాయి.

దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 20,57,562 కి చేరింది. అలాగే గత 24 గంటల్లో 2 మంది మృత్యువాత ప‌డ్డారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో మృతుల సంఖ్య 14,256 ద‌గ్గ‌ర నిలిచింది. అలాగే నిన్నొక్క రోజే 994 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 20,36,048 కి చేరుకుంది. ప్ర‌స్తుతం ఏపీలో 7,258 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, నిన్న‌ రాష్ట్ర‌వ్యాప్తంగా 23,022 క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హించారు.