సినీ పరిశ్రమలో సెలబ్రెటీల పెళ్లిళ్లు, విడాకులు బాగా కామన్ అయిపోయాయి. గాఢంగా ప్రేమించుకుని, ఆపై పెళ్లి చేసుకుని.. మళ్లీ కొన్నేళ్లకే విడిపోయిన సెలబ్రెటీ కపుల్స్ ఎందరో ఉన్నారు. ఈ లిస్ట్లో తాజాగా సమంత-నాగచైతన్య కూడా చేరిపోయారు. ఈ మధ్యే వీరిద్దరూ అధికారికంగా తమ విడాకుల విషయాన్ని వెల్లడించారు.
ఇకపోతే.. ఒకప్పుడు మహేష్-సమ్రతలు కూడా విడిపోబోతున్నారంటూ రకరకాల వార్తలు వచ్చేవి. అందుకు కారణం వారిద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ స్వీట్ అండ్ లవ్లీ కపుల్ అంటే గుర్తుకు వచ్చే పేర్లలో ముందు ఉండే జంట మహేష్ బాబు-నమ్రత జంటే. ‘వంశీ’ సినిమాతో మొదలైన వీరి పరిచయం.. ఆ తర్వాత ప్రేమ, పెళ్లి వరకు వెళ్లింది. ముంబైలోని మారియట్ హోటల్లో ఫిబ్రవరి 10, 2005 తేదిన మహేష్, నమ్రతల వివాహం చాలా సింపుల్గా, సీక్రెట్గా జరిగింది.
ఈ పెళ్లిలో కేవలం ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. అయితే పెళ్లైన మూడేళ్లకు అంటే.. 2008లో మహేష్-నమ్రతల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలోనే వీరిద్దరూ తరచూ గొడవలు పడేవారు. దాంతో మహేష్-నమ్రతల బంధానికి బీటలు వారిందని, ఇద్దరూ విడిపోయారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ వార్తలకు తగ్గట్లే నమ్రత తన కొడుకుతో పాటు ముంబైకి షిఫ్ట్ అయింది. మరోవైపు అభిమానులు కూడా ఈ విషయంలో తెగ ఖంగారు పడి పోయారు. కానీ, మహేష్-నమ్రతల మధ్య ఉన్న బలమైన ప్రేమే.. చివరకు వారిద్దరినీ ఒకటి చేసింది.