రోడ్డుపై 2 వేల నోట్లు వెదజల్లిన బాలీవుడ్ హీరో !

షాహిద్‌ కపూర్‌ నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘సన్నీ’.. ‘ఫ్యామిలీ మేన్‌’ సిరీస్‌ను తెరకెక్కించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌, డీకేలు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ముంబై మహానగరంలోని ఒక ప్రాంతంలో ఈ సిరీస్‌ కు సంబంధించి చిత్రీకరణలో భాగంగా ఓ యాక్సిడెంట్‌ సన్నివేశం ఉంది. ఆ సమయంలో కరెన్సీ నోట్లు రోడ్డుపై చల్లాచెదురుగా పడిపోయాయి. అక్కడ రోడ్డు మీద రూ.రెండు వేల నోట్లు కుప్పలుకుప్పలుగా పడి ఉన్నాయి. ఈ విషయం తెలిసిన కొద్ది సేపటికి చుట్టుపక్కల ఉండే వాళ్లంతా వాటిని ఏరుకోవడానికి ఎగబడ్డారు.

కానీ తీరా వాటిని సరిగ్గా చూస్తే అవి నకిలీ నోట్లు అని తేలడంతో వాళ్లంతా పాపం..! నిరాశతో వెనుదిరిగారు. అయితే షూటింగ్ కోసం నకిలీ నోట్లను ఉపయోగించారు. కొందరేమో ఇలా గాంధీ మహాత్ముడు ఫొటో ఉన్న నోట్లను రోడ్డుపై పారేయడం నేరం అంటూ కేసు పెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళం ఏర్పడింది.అక్కడ కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘చిత్రీకరణ కోసం అనుమతి తీసుకున్నారు. గాంధీ మహాత్ముడికి అవమానం జరిగిందనే విషయంపై విచారణ చేస్తున్నాం’ అని పోలీస్‌ వర్గాలు చెప్పినట్టు తెలుస్తోంది.

ఇక చిత్రీకరణ ముగిశాకా అంతా శుభ్రం చేసింది మా బృందం. మరి ఆ నకిలీ నోట్లు ఎలా వచ్చాయో మాకు తెలియడం లేదు. ఇక గాంధీని అగౌరవ పరచాలనే ఉద్దేశ్యం అయితే మాకు ఎంతమాత్రం లేదు అని చిత్ర నిర్మాతలు చెప్పినట్టు బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ఒక్కోసారి చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఇదిగో ఇలా సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఈ సిరీస్‌లో విజయ్‌ సేతుపతి, రాశీ ఖన్నా, రెజీనా కూడా నటిస్తున్నారు.