మందుబాబులకు గుడ్ న్యూస్.. ఖజానాకు కొత్త ఆదాయం..?

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు ఆదాయం చేకూర్చే విధంగా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ కు సంబంధించి చార్జీల పెంపు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కొత్తగా మద్యం షాపులను పెంచి దాని ద్వారా వచ్చే ఆదాయంతో ఖజానా నింపనుంది.
కొత్త గా తీసుకున్న ఈ నిర్ణయం మందుబాబులకు లో ఉత్సాహాన్ని రేపుతోంది. ఖజానా నింపడం కోసం కొత్తగా 225 వైన్ షాప్ లను ఏర్పాటు చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణ లో వున్నా 2200 మద్యం దుకాణాలకు గాను ప్రతి సంవత్సరం సుమారు 27 వేల కోట్లు రూపాయిలు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. ఇప్పుడు కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఆదాయం మరింత పెరిగే విధంగా ఉంది.