పోసాని ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తుల రాళ్లదాడి …ఈ పని చేసిందెవరంటే ..!

ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఇంటిపై.. గురువారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ విషయమై పోసాని ఇంటి వాచ్ మన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోసాని కృష్ణమురళి హైదరాబాద్ లోని అమీర్ పేట లో నివాసం ఉంటున్నాడు. ఇవాళ ఉదయం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటి వద్దకు వచ్చి బూతులు తిడుతూ ఇంటి ముందు వీరంగం సృష్టించారని పోసాని ఇంటి వాచ్ మన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోసాని కృష్ణమురళి ఇంటిపై కూడా రాళ్ల దాడి చేసినట్లు అతడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. రెండు రోజుల కిందట పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు ఆయన సంగతి తెలిసిందే. ఆయన హైదరాబాదులోని ప్రెస్ క్లబ్ లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న పవన్ అభిమానులు పోసాని పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని స్టేషన్ తరలించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో పోసాని కృష్ణమురళి అమీర్ పేట లోని తన ఇంటిలో ఉండడం లేదని తెలుస్తోంది. వేరేచోట ఎక్కడో ఉంటున్నారు. కాగా పోసాని కృష్ణమురళి ఇంటిపై రాళ్ల దాడి చేసిన వ్యక్తులు ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అక్కడ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.