ఆ నమ్మకంతోనే బతికేస్తున్నా..సునీత భావోద్వేగం..ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ సింగ‌ర్‌, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. డిజిటల్ మీడియా ప్రముఖుడు రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న త‌ర్వాత సునీత ఏం చేసినా, ఏ పోస్ట్ పెట్టినా తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇక తాజాగా సునీత లెజెండరీ సింగర్ బాలసుబ్రమణ్యంను త‌లుచుకుంటూ భావోద్వేగానికి గురైంది.

singer sunitha: Sunitha : ఆ నమ్మకంతోనే బతికేస్తున్నా.. ఎస్పీబీని తలుచుకుంటూ సునీత ఎమోషనల్ - singer sunitha gets emotional on spb death | Samayam Telugu

నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న‌ ఎస్పీబీ.. 2020 సెప్టెంబర్ 25న తుదిశ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. కరోనా మహమ్మారి బారిన పడిన ఆయ‌న సుదీర్ఘ పోరాటం అనంతరం ఈ లోకాన్ని విడిచి అంద‌రినీ శోక‌సంద్రంలో ముంచేశారు. అయితే ఆ గానగంధర్వుడు ఈ లోకాన్ని విడిచి సంవత్సరం కావస్తున్న నేపథ్యంలో సునీత ఎమోషనల్ అయ్యారు.

SP Balasubrahmanyam Funeral: Legendary singer buried with full state honours with Ilayaraja's tribute music | PINKVILLA

తాజాగా ఆయ‌న‌తో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. `మావయ్యా.. ఒక్కసారి గతంలోకి నడవాలనుంది. నీ పాట వినాలనుంది. నువ్ పాడుతుంటే మళ్ళీ మళ్ళీ చెమర్చిన కళ్ళతో చప్పట్లు కొట్టాలనుంది. ఇప్పుడు ఏంచెయ్యాలో తెలీని సందిగ్ధం లో నా గొంతు మూగబోతోంది. సంవత్సరం కావొస్తోందంటే నమ్మటం కష్టంగా వుంది. ఎప్పటికీ నువ్వే నా గురువు, ప్రేరణ, ధైర్యం, బలం, నమ్మకం. ఎక్కడున్నా మమ్మల్నందర్నీ అంతే ఆప్యాయతతో చుస్కుంటున్నావన్న నమ్మకముంది. ఆ నమ్మకంతోనే నేను కూడా బతికేస్తున్నా..` అంటూ సునీత పేర్కొంది. దాంతో ఇప్పుడు ఆమె పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

https://www.instagram.com/p/CTY7vxLlv-5/?utm_source=ig_web_copy_link