సర్కారు వారి పాట సినిమా కోసం మహేష్ అన్ని కోట్లు అందుకున్నాడా..?

ప్రముఖ దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ సంస్థ వారు నిర్మిస్తున్న సినిమా సర్కార్ వారి పాట.. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా , కీర్తి సురేష్ ఆయనకు జోడీగా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది అని చెప్పాలి.. ఇకపోతే ఈ సినిమా అప్పుడప్పుడు లీకుల కు గురి అయినా, ప్రేక్షకులలో మాత్రం అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి.. ఇక ఈ సినిమాలో విలనిజాన్ని చూపించడానికి సముద్రకని రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

ఇకపోతే సర్కారు వారి పాట సినిమా త్వరలోనే విడుదలవుతున్న నేపథ్యంలో, ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎంత అందుకున్నాడు అనే విషయం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ వారు మహేష్ బాబు కు 50 కోట్ల రూపాయలను పారితోషికంగా ఇస్తున్నారట.. ఇక ఇంత అందుకున్న మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తో నిర్మాతలకు అలాగే ప్రేక్షకులకు న్యాయం చేస్తాడో లేదో వేచి చూడాలి..