సాయి ధరంతేజ్ యాక్సిడెంట్ అయిన బైక్ ధర ఎంతో తెలుసా..?

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరొక హీరో సాయి ధరమ్ తేజ్.ఈయన శుక్రవారం రోజున యాక్సిడెంట్ కు గురైన సంగతి ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.ఇక అందులో ఆయన ఆరోగ్యంపై ఎన్నో పుకార్లు వచ్చినా కూడా.అల్లు అరవింద్ వాటన్నిటికీ సమాధానం చెప్పేశాడు.అయితే సాయి ధరంతేజ్ వాడిన బైక్ విషయంపై ఇప్పుడు ఎక్కువగా తమ అభిమానలు మాట్లాడుకుంటున్నారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.

 

సాయి ధరంతేజ్ కు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం అంట.ఎప్పటిలాగే స్పోర్ట్స్ బైక్ తీసుకొని రోడ్డు మీద వెళుతూ ఉండగా.నడుపుతూ ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడిపోయాడు.ప్రస్తుతం 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు తెలియజేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ వాడిన బండి స్కిడ్ కావడానికి ముఖ్య కారణం అక్కడ ఉండేటువంటి మట్టి,బురద అన్నట్లుగా తెలుస్తోంది.

 ట్రయంప్ ట్రిడెంట్ బైక్ లాంచింగ్‌లో సాయి తేజ్ Photo : Twitter

ఇక ఈ బైక్ విషయానికి వస్తే ఈ బండి పేరు.. ట్రయంప్ ట్రైడెంట్ గా తెలుస్తోంది.ఈ బైక్ ఖరీదు దాదాపుగా ఏడు లక్షల రూపాయల వరకు ఉండనుంది.ఇక ఈ బైక్ సిసి ఇంజన్ 660 గా కలిగి ఉంది.ఈ బైకు బరువు దాదాపుగా 190 కేజీలు ఉండను ఉన్నట్లుగా సమాచారం.