ప్రకాష్ రాజ్ టీమ్ లో చేరిన రెబల్స్ జీవిత, హేమ..?

టాలీవుడ్ లో ఈమధ్య కాలంలో ఎక్కువగా మా ఎలక్షన్ల గురించే మాట్లాడుకునేవారు. అలా మా ఎలక్షన్ల కోసం ఎంతోమంది పోటీ పడడానికి సిద్దమవుతున్నారు. అలా బరిలో దిగిన వారిలో నటి హేమ, జీవిత రాజశేఖర్ ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, నరేష్ వంటి వారు ఉన్నారు. ఇక ప్రస్తుతం ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రకాష్ రాజ్ ప్యానల్ లో నటి హేమ , జీవిత కలిసి ఒకటిగా నిలబడాలని చూస్తున్నారట.

అయితే నిజానికి అధ్యక్ష పదవికి పోటీ చేస్తానన్న హేమ, జీవిత రాజశేఖర్ లను ఇటీవల ప్రకాష్ రాజ్.. వారితో చర్చలు జరిపి ఇతర విభాగాల్లో పదవులు చేపట్టాలని చెప్పినట్లు సమాచారం. ఇకపోతే పాత ప్యానల్లో సాయికుమార్, శ్రీ రామ్ ఏడిద , బండ్ల గణేష్ ఇప్పుడు ఉండరు..ఇక హేమ ఉపాధ్యక్షురాలు పదవికి , జీవిత రాజశేఖర్ జనరల్ సెక్రటరీ పదవికి ,ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేయనున్నారు.

హేమ మాట్లాడిన వివాదాస్పద మాటల వల్ల ఆమె ను మా ఎలక్షన్లు నుంచి సస్పెండ్ చేస్తారేమో అన్నట్లుగా ప్రచారం చేశారు.. కానీ ఇప్పుడు ఆమెను ఏకంగా ప్యానల్ లోకి తీసుకోవడం గమనార్హం. బండ్ల గణేష్, సాయి కుమార్ లను అధికార ప్రతినిధులుగా ప్రకాష్ రాజు నియమిస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో నే ప్రెస్ మీట్ పెట్టి , వారి ప్యానల్ ఎజెండా ఏమిటి..? ఏ ఏ పనులు చేయబోతున్నారు..? అని కచ్చితంగా వివరిస్తామని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఇక మా అధ్యక్షపదవికి ఏకంగా ఐదు మంది పోటీ చేయబోతున్నారు అని అనుకునేలోపే ఇక ఇద్దరు ప్రకాష్ రాజు ప్యానల్ లో చేరిపోయారు.

తెలంగాణ నుంచి పి.వి.నరసింహారావు పోటీ చేస్తానని ప్రకటించినా, ఆ తర్వాత ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు.. మొత్తంగా మా అధ్యక్ష పదవి ప్రకాష్ రాజు కు వెళ్లబోతోంది అనే వార్తలు మాత్రమే గట్టిగా వినిపిస్తున్నాయి.