ప్రగ్యా జైస్వాల్ కు తీరని కోరిక.. ఈ సినిమాతో నెరవేరుతుందా..?

ప్రగ్యా జైస్వాల్.. అందానికి తగ్గ హైట్.. మంచి కలర్.. ఈమె గనుక తన నటనలో తనకున్న ప్రతిభను చూపించినట్లు అయితే, కచ్చితంగా స్టార్ హీరోయిన్ అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. ఇకపోతే ప్రగ్యా జైస్వాల్ కు ఒక తీరని కోరిక ఉండిపోయిందట.. అయితే ప్రస్తుతం ఈమె బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాలో ఒక పాత్రలో మనకు కనిపించబోతోంది. ఇక ప్రగ్యా జైస్వాల్ తీరని కోరిక ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

2014లో డేగా సినిమాతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ , ఆ తర్వాత 2015 వ సంవత్సరంలో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన కంచె సినిమాలో నటించి మెప్పించింది. 2017 సంవత్సరంలో ఓం నమో వెంకటేశాయా.. గుంటూరోడు.. నక్షత్రం.. జయ జానకి నాయక.. 2018లో ఆచార్య అమెరికా యాత్ర వంటి సినిమాల్లో నటించినప్పటికీ .. ప్రేక్షకుల నుంచి ప్రగ్యా జైస్వాల్ కు పెద్దగా ఆదరణ లభించలేదని చెప్పాలి. కానీ ఈమెకు స్టార్ హీరోయిన్ అవ్వాలనే కోరిక బలంగా ఉండిపోయిందట.

అంచేతనే ప్రస్తుతం నటసింహం బాలకృష్ణ నటిస్తున్న అఖండ సినిమాలో ఒక పాత్రలో నటించడానికి సిద్ధమయింది. అంతే కాదు ఈమె పాత్ర కోసం బోయపాటి శ్రీను ప్రత్యేకంగా డిజైన్ చేశారు అని ప్రగ్యా జైస్వాల్ ఇటీవల తెలిపింది.ఈ సినిమాకు సంబంధించి అడిగా అడిగా అనే పాట విడుదలయ్యి మంచి రెస్పాన్స్ అందుకోవడంతో తన కోరిక నెరవేరుతుందనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం..