ఆ యాడ్ నుంచి వెంటనే తప్పుకోండి.. అమితాబ్ కు అభిమాని లేఖ?

బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ కు నేషనల్ యాంటీ టోబాకో ఆర్గనైజేషన్ సంస్థ ఒక యాడ్ విషయంలో సంచలన లేఖ రాసింది. పాన్ మసాలా ప్రమోషన్స్ యాడ్ నుంచి వైదొలగాలి అంటూ నాతో అధ్యక్షుడు అయిన శేఖర్ సల్కర్ అమితాబ్ బచ్చన్ ను కోరారు. పాన్ మసాలా లో పొగాకు ఉంటుందని ఇది ప్రజలను వ్యస పరులుగా మారుతుందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఇటువంటి వాణిజ్య ప్రకటనల నుంచి అమితాబచ్చన్ వీలైనంత త్వరగా తప్పుకోవాలి అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. అమితాబ్ హై ప్రొఫైల్ పల్స్ పోలియో ప్రచారానికి ప్రభుత్వం తరఫున బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

అటువంటి వ్యక్తి ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే పాన్ మసాలా యాడ్ లో నటించడం సరికాదు అందువల్ల వెంటనే ఈ యాప్ నుంచి తప్పుకోవాలి, అప్పుడే పొగాకు వ్యసనానికి యువత దూరమయ్యేందుకు ఈ చర్య దోహదపడుతుంది అని తెలిపారు. అంతేకాకుండా పాన్ మసాలా క్యాన్సర్ కారకంగా పనిచేస్తుంది అన్న విషయం పరిశోధనల్లో తేలిందని ఇందులోని పదార్థాలు నోటి క్యాన్సర్కు దారితీస్తాయి అంటూ శేఖర్ తన లేఖలో రాసుకొచ్చారు. శేఖర్ రాసిన లేఖ ప్రకారం అమితాబచ్చన్ తప్పుకుంటారా?లేదా? తెలియాలి అంటే అమితాబ్ స్పందించే వరకూ వేచి చూడాల్సిందే.