ప్రతిరోజూ సగటున భారతదేశంలో మహిళల మీద ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి తెలుసా..?

ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా మహిళలపై చిన్న పిల్లలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ప్రతిరోజూ సగటున మహిళలపై జరుగుతున్న సర్వే చేసిన ప్రకారం రోజుకు 77 మంది మహిళలపై భారత దేశంలో అత్యాచారాలు జరుగుతున్నట్లుగా ఒక సర్వేలో వెల్లడైంది. ఇక 2020 లో మహిళలపై ఇప్పటివరకు జరిగిన కేసులు మొత్తం..28,153 మంది బాధితులు పై అత్యాచార ఘటనలు జరిగాయి. వీటన్నిటిని..NCRB సర్వేలో తెలియదు తెలిపింది.

ఇక తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం 2020 సంవత్సరంలో భారత దేశంలో రోజు వారి సగటు కేసు 77 మందికి రేపు లకు గురయ్యారట.. అంటే సంవత్సరానికి 28,046 సంఘటనలు జరిగాయి. దేశవ్యాప్తంగా 3,71,503 మంది మహిళలపై నేర కేసులు నమోదయ్యాయి. ఇక 2019 సంవత్సరంలో 4,05,326 మంది జరగగా.. 2018లో 3,78,236 మంది పై హత్యాచారం జరిగాయి.

కానీ 2020 సంవత్సరంలో మహిళలపై నేరాలు మొత్తం..28,153 ఇందులో..2,655 మందీప్ 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల వారు.

NCRB డేటా ప్రకారం ప్రాంతాల వారిగా:

2020 సంవత్సరం లో రాజస్థాన్లో అత్యధికంగా 5,310 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఇక ఉత్తరప్రదేశ్ లో(2,769), మధ్యప్రదేశ్ లో (2,339), మహారాష్ట్ర (2,061) అస్సాం (1,657) ఢిల్లీలో 997 కేసులు నమోదయ్యాయి.