యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బుల్లితెరపై హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ గేమ్ షోకు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఒకవైపు బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో గట్టి పోటీనిస్తున్నా, తారక్ తనదైన యాంకరింగ్తో ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్ను విజయవంతం చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇక ఈ షోకు అదిరిపోయే టీఆర్పీ రేటింగ్స్ను తీసుకొచ్చేందుకు అటు నిర్వాహకులు కూడా పెద్ద ప్లాన్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు సెలెబ్రిటీలను ఈ గేమ్ షోకు గెస్ట్లుగా పిలిచి ఈ షోను మరింత క్రేజీగా మారుస్తున్నారు.
ఇటీవల స్టార్ డైరెక్టర్స్ కొరటాల శివ, రాజమౌళిలు ఈ గేమ్షో లో తారక్తో చేసిన సందడి మనం చూశాం. ఇక ఈ షోలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా త్వరలో రానున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. అయితే మరో స్టార్ హీరోను తారక్ ఈ షో కోసం పట్టుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఏకంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ను ఎవరు మీలో కోటీశ్వరులు హాట్ సీట్లో కూర్చోబెట్టేందుకు తారక్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందట. దసరా కానుకగా మహేష్ బాబు ఎపిసోడ్ను టెలికాస్ట్ చేసి టీఆర్పీ రేటింగ్స్ను మరో లెవెల్కు తీసుకెళ్లేందుకు తారక్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తుండగా, ప్రభాస్తో చేయబోయే ఎపిసోడ్ను దీపావళి కానుకగా టెలికాస్ట్ చేయాలని వారు ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్ టీఆర్పీ రేటింగ్స్ తుక్కు రేగొట్టేందుకు చాలా పెద్ద ప్లాన్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి.