మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. రొమాంటిక్ ట్రైలర్..!

టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని మరియు పూజా హెగ్డే కలిసి నటిస్తున్న రొమాంటిక్ చిత్రం” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ఇ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ వహిస్తున్నాడు.ఈ సినిమాను అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఇటీవలె u/a సర్టిఫికెట్ కూడా అందుతుంది. కొద్ది నిమిషాల నుండి ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల కాదా ఆ విశేషాలు చూద్దాం.

ఈ సినిమాలో అఖిల్ మరియు పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక వీరిద్దరి మధ్య జరిగే రొమాన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని చిత్ర బృందం బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు సమాచారం.ఈ సినిమాని అక్టోబర్ 15న దసరా కానుక సందర్భంగా అన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలియజేస్తోంది.

ఇక ఈ సినిమాలో ముఖ్యంగా అఖిల్ తన వివాహం కోసం తాపత్రయపడే సీన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే పూజా హెగ్డే అందాలు, జాతి రత్నాలు సేమ్ డ్యూటీ ఈశా రెబ్బ లాంటి హీరోయిన్లు కూడా ఇందులో కనువిందు చేస్తున్నారు.ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి అంటున్నారు అభిమానులు.