మహేష్ బాబు పై ట్రోల్స్.. ఆ ప్రచారమే కారణం?

డబ్బుల కోసం సినీ తారలు తమ అభిమానులు ఎలాంటి ఉత్పత్తి అయినా కొనుగోలు చేయమని ప్రోత్సహిస్తూ ప్రకటనల్లో నటిస్తూ ఉంటారని చాలా కాలంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి వివాదం లోనే ప్రిన్స్ మహేష్ బాబు చిక్కుకున్నారు. మహేష్ బాబు అలాగే బాలీవుడ్ యాక్టర్ టైగర్ పాన్ బహార్ అనే మౌత్ ఫ్రెషనర్ యాడ్ లో కనిపించారు. ఈ పాన్ బహార్ మౌత్ ఫ్రెషనర్ తినడాన్ని హీరోయిజం ఎలివేట్ చేశారు. దీంతో ఈ యాడ్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ కంపెనీ ఉత్పత్తులు క్యాన్సర్ కారకమని కేంద్ర ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తన చిత్రాల్ని అనధికారంగా ఉపయోగించుకున్నందుకు ఆ సంస్థపై న్యాయపోరాటం కూడా ప్రారంభించారు. ఈ ఉత్పత్తులు ప్రమాదకరమైనవి అని పలు వైద్య నివేదికలో వెల్లడయ్యింది. వీటి వల్ల కాలేయం కడుపులో మానని గాయాలు కారణమవుతుందని అధ్యయనంలో వెల్లడయింది. ఉత్పత్తుల వల్ల మూత్ర పిండాల తో పాటుగా లైంగిక సామర్థ్యం దెబ్బతీస్తుందని సంతాన సామర్థ్యాన్ని తగ్గిస్తుందని పలు నివేదికలో వెల్లడయ్యింది.