కన్నడ మీడియా పై ఫైర్ అయిన సోనియా అగర్వాల్..?

టాలీవుడ్ లో 7/G బృందావన్ కాలనీ సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సోనియా అగర్వాల్. అయితే ప్రస్తుతం ఈమెకు కన్నడ మీడియా పెద్ద తలనొప్పిగా మారింది.నిన్న సోనియా అగర్వాల్ డ్రగ్స్ కేసులో చిక్కినట్లు కొంతమంది మీడియా ద్వారా తెలియజేశారు.కానీ వాస్తవానికి కన్నడ సోషల్ మీడియా సోనియా అగర్వాల్ ఫోటో బదులుగా టాలీవుడ్ లో నటించిన ఈమె ఫోటో పెట్టడం వల్ల ఆ వార్త కాస్త వైరల్గా మారింది.

మరికొందరైతే ఏకంగా ఆమె డ్రగ్స కుంభకోణంలో ఇరుక్కున్న ట్లు రాసేశారు.ఇక ఈ వార్త సోనియా చెంతకు చేరే సరికి బాగా పాపులర్ అయింది డ్రగ్స్ విషయం.ఇక ఈమె పరువు పోయిందంటూ వాపోయింది.దీంతో స్నేహితులు ఆమె కు ఫోన్ చేస్తూ ఆరా తీయడం మొదలు పెట్టారు.

తమిళ చిత్రంలో షూటింగ్ నిమిత్తం సోనియా అగర్వాల్ కేరళకు వెళ్లినంటూ చెప్పుకొచ్చింది.ఆపై ఈమె దృష్టికి ఈ విషయం రాగానే తీవ్రంగా ఖండించింది ఈ విషయాన్ని. తనపై తప్పుగా రాసినటువంటి మీడియా కన్నడ జర్నలిస్టులను చర్యలు తీసుకుంటాం అంటూ తెలియజేసింది.ఇక అంతే కాకుండా జర్నలిస్టులు సరిగ్గా వర్క్ చేయకపోవడంతో తన పరువుకు భంగం కలిగించారంటూ సోనియా అగర్వాల్ వాపోతోంది.