ఛీ..వాడు భ‌ర్తేనా..? భార్య కాలు, చేయి నరికేసి అలా చేశాడ‌ట‌?!

క‌డ‌ప జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. అనుమానం అనే పెనుభూతం కార‌ణంగా క‌ట్ట‌కున్న భార్య కాలు, చేయి న‌రికేసి క‌ర్క‌షంగా ప్ర‌విర్తించాడో భ‌ర్త‌. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర క‌ల‌కలం రేపుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..కడప జిల్లాలోని చక్రాయపేట మండలం బీఎన్ తండాలో ఇస్లావత్ నాగనాయక్, ఈశ్వరమ్మ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు.

భార్యపై అనుమానంతో ఆమె కాలు, చెయ్యి నరికేసిన భర్త ఆపై .. కడప జిల్లాలో ఓ భర్త శాడిజం | Sadist Husband chopped off wife's leg and hand with Suspicion in Kadapa district - Telugu Oneindia

అయితే పాతికేళ్ల వీరి వివాహ బంధంలో అనుమానం అనే మ‌హ‌మ్మారి చిచ్చు రేపింది. భార్యపై అనుమానం పెంచుకున్న నాగనాయక్ ఆమెను వేధించడం స్టార్ట్ చేశారు. ఈ క్ర‌మంలోనే వీరిద్దరి మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రిగాయి. తాజాగా కూడా భార్య‌తో వివాదం పెట్టుకున్న నాగ‌నాయ‌క్‌.. కోపోద్రిక్తుడై ఆమె ప‌ట్ల‌ విచక్షణ కోల్పోయి ప్ర‌వ‌ర్తించాడు.

mathura murder case husband hired contract killers to kill his wife for second marriage uppp | मथुरा मर्डर केस: पति करना चाहता था दूसरी शादी तो 1 लाख में दे दी पत्नी

భార్య కాలు, చేయిని గొడ్డ‌లితో నరికేసి..అక్క‌డ నుంచి ప‌రార్ అయ్యాడు. ఇది గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే ఈశ్వరమ్మను హాస్ప‌ట‌ల్‌కు తీసుకువెళ్లారు. ప్ర‌స్తుతం వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఈశ్వ‌ర‌మ్మ ద‌గ్గ‌ర నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. నాగనాయక్ కోసం గాలిస్తున్నారు.