దిల్ రాజు ఏంటి ఇంత ఝలక్ ఇచ్చాడు..పవన్ ఫ్యాన్స్ కి షాక్..!

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు మొదటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమాని. పవన్ నటించిన తొలిప్రేమ, ఖుషి సినిమాల డిస్ట్రిబ్యూషన్ తోనే ఆర్థికంగా నిలదొక్కుకున్న దిల్ రాజు ఆ తర్వాత ఆర్య సినిమాతో నిర్మాతగా మారి తెలుగులో అగ్ర నిర్మాత గా పేరుతెచ్చుకున్నాడు. ఇటీవల తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమా తీసి తన కల కూడా నెరవేర్చుకున్నట్లు తెలిపారు. అంత అభిమానంగా ఉన్న దిల్ రాజు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన కామెంట్స్ పవన్ అభిమానులను షాక్ కు గురి చేస్తున్నాయి.

నిన్న దిల్ రాజు తదితర నిర్మాతల బృందం ఏపీ మంత్రి పేర్ని నాని ని కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. ‘సినిమాను కాంట్రవర్షియల్ చేయొద్దు.. సినిమాలు వేరు..రాజకీయాలు వేరు.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సినీ ఇండస్ట్రీకి ఎంతో సానుకూలంగా ఉన్నాయి. ఆన్ లైన్ టికెటింగ్ విధానం కూడా నిర్మాతలు కోరితేనే ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది.’ అని దిల్ రాజు వ్యాఖ్యానించారు.

దిల్ రాజు కామెంట్స్ చూస్తే సినిమా ఇండస్ట్రీని రాజకీయాల కోసం వాడుకోవద్దని పవన్ కళ్యాణ్ కు పరోక్షంగా చెప్పినట్లయింది. ఆన్ లైన్ టికెటింగ్ విధానం కూడా తాము అడిగితేనే ప్రభుత్వం అమలులోకి తీసుకు వచ్చిందని ప్రకటించి పవన్ కళ్యాణ్ కు పెద్ద ఝలక్ ఇచ్చాడు. మొదటినుంచి పవన్ కళ్యాణ్ కు సానుకూలంగా ఉండే దిల్ రాజు నిన్న మంత్రి ని కలిసిన తర్వాత ఒక్కసారిగా పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడడంపై ఆయన అభిమానులు షాక్ కు గురవుతున్నారు.