భార‌త్‌లో వ‌ణికిస్తున్న క‌రోనా..మ‌ళ్లీ 40 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు!

పెను భూతంలా ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపిన ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి.

అయితే ఇర‌వై వేల‌కు ప‌డిపోయిన‌ క‌రోనా కేసులు.. గ‌త కొద్ది రోజుల నుంచి మాత్రం మ‌ళ్లీ 40 వేల‌కు పైగా న‌మోదు అవుతున్నాయి. ఇప్పుడు ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు వ‌ణుకు పుట్టిస్తోంది. గ‌త 24 గంటల్లో భారత్‌లో 41,965 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,28,10,845 కు చేరుకుంది. అలాగే నిన్న 460 మంది క‌రోనా కార‌ణంగా మృత్యువాత ప‌డ‌గా.. దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,39,020 కు పెరిగింది.

ఇక నిన్న ఒక్క‌రోజే 33,964 మంది కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కరోనా నుంచి 3,19,93,644 మంది హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ప్ర‌స్తుతం 3,78,181 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, నిన్నొక్క రోజే దేశ‌వ్యాప్తంగా 16,06,785 క‌రోనా టెస్టులు నిర్వ‌హించారు.