సినీ ఇండస్ట్రీ లో విషాదం..ప్రముఖ నిర్మాత మృతి..!

!టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక ఈ రోజున టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఆర్ ఆర్ వెంకట్ ఈ రోజు ఉదయం కన్ను మూశారు.ఆర్‌.ఆర్‌.వెంకట్‌ హైదరాబాదులో గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నారు. నిర్మాతగా తన ప్రయాణంలో ఆర్.ఆర్.వెంకట్ ఆర్.ఆర్.మూవీమేకర్స్ పలు చిత్రాలు నిర్మించారు.

ఇక ఈయన నిర్మించిన సినిమాలలో.. ఆంధ్రావాలా, సామాన్యుడు, కిక్, ఆటోనగర్ సూర్య, బిజినెస్ మాన్, పైసా, మిరపకాయ్, పూలరంగడు వంటి సినిమాలకు ఆయన నిర్మాతగా వహించాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ఇండస్ట్రీలోని కొంత మంది ఆయనకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.దీంతో సినీ ఇండస్ట్రీ మొత్తం శోకసముద్రంలో నిండిపోయింది.