మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు ఐపీఎల్-2 దశ ప్రారంభం కానుంది. ఐపీఎల్ ప్రారంభమై బాగా సాగుతున్న సమయంలో కరోనా వైరస్ ఎంట్రీ ఇవ్వడంతో చివరికి ఐపీఎల్ వాయిదావేసే పరిస్థితి వచ్చింది. అన్ని పరిస్థితులు సర్దు మురిగిన తరువాత మళ్ళీ తిరిగి ఐపీఎల్ మ్యాచ్ లను UAE లో వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.
ఇక సెప్టెంబర్ 19 వ తేదీన ఐపీఎల్ రెండవ దశ మళ్లీ ప్రారంభం కానున్నట్లు సమాచారం.ఐపీఎల్ మ్యాచ్ లో అత్యధికంగా ఆడిన ఆటగాళ్లు కోసం సోషల్ మీడియాలో ప్రేక్షకులు ఎక్కువగా వెతుకుతున్నారు. ఇక 2008 ఐపీఎల్ ప్రారంభమైంది. ఇక భారత దేశం నుంచి అత్యధికంగా ఆడిన ఆటగాళ్ల లిస్టు ఒకసారి చూద్దాం.
ఐపీఎల్ చరిత్రలో మూడు సార్లు టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎక్కువ మ్యాచ్ ఆడిన ఆటగాళ్ల లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన రోహిత్ శర్మ రెండవ స్థానంలో ఉన్నారు. మహేంద్రసింగ్ ధోని 211 మ్యాచ్లు ఆడాడు. రోహిత్ శర్మ..207 మ్యాచ్లు ఆడాడు. దినేష్ కార్తీక్..203 సురేష్ రైనా..200 విరాట్ కోహ్లీ..199 వీరే ఇప్పటి వరకు ఎక్కువ మ్యాచ్లలో ఆడారు