అల్లుడు కోసం దిగి వచ్చిన మామ.. ఖుషీలో పవన్ ఫ్యాన్స్..!

సాయి ధరంతేజ్ ఇటీవల ఆక్సిడెంట్ కి గురి అయిన విషయం తెలిసిందే. అయితే ఈయన నటించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1వ తేదీన విడుదల కావాల్సి ఉండగా, ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో తప్పకుండా సాయిధరమ్ తేజ్ హీరోగా తన బాధ్యత గా పాల్గొనాల్సి ఉంటుంది.. కానీ ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ రెస్ట్ తీసుకోవాలి కాబట్టి ప్రమోషన్స్ లో పాల్గొనలేదని సమాచారం.. ఇందుకోసం ఏకంగా సాయి ధరమ్ తేజ్ మామగారైన మెగాస్టార్ చిరంజీవి , పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రమోషన్స్ లో భాగంగా రావడం జరిగింది..

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఆయన కనిపిస్తే ప్రేక్షకులలో పూనకాలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఈయన పవన్ కళ్యాణ్ మరో మెగా హీరో మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేయనున్నారు.. అదే సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న రిపబ్లిక్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరవుతున్నారు.. అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలోనే సెప్టెంబర్ 25 వ తేదీ జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 6 గంటలకు జరగనున్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన పాల్గొంటారు .https://twitter.com/PawanismNetwork/status/1441017379668967424?s=20