అక్షయ్ కుమార్ వర్సెస్ ప్రభాస్.. పైచేయి ఎవరిదో..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, సలార్ సినిమాలను ముగించే పనిలో పడ్డాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో చేస్తున్న ఆదిపురుష్ పై ప్రభాస్ ఫోకస్ పెట్టనున్నాడు.

కాగా ఈ సినిమా విడుదలకు సంబంధించి తాజాగా మేకర్స్ అఫీషియల్ డేట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆది పురుష్ సినిమా వచ్చే ఏడాది స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 11న తెలుగు, తమిళ, హిందీ,మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. కానీ అదే రోజు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న రక్షాబంధన్ సినిమా కూడా విడుదల కానుంది.

బాలీవుడ్లో అక్షయ్ సినిమాలు కూడా భారీగా వసూళ్లు వస్తుంటాయి. దీంతో ఒకేరోజు ఇద్దరు అగ్ర హీరోలు నటించిన సినిమాలు పోటీ పడుతుండడంతో ఏ సినిమాకు నష్టం జరుగుతుందో చూడాల్సి ఉంది. సౌత్ లో ప్రభాస్ కు తిరుగు లేకున్నా బాలీవుడ్లో మాత్రం అక్షయ్ కుమార్ తో పోటీ తప్పేలా లేదు.