ఆరుగురు దర్శకులతో భేటీ కానున్న మహేష్ బాబు..ఎందుకంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన నటనతో, అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడమే కాకుండా యువతుల మనసును గెలుచుకున్న ఏకైక హీరోగా గుర్తింపు పొందాడు.. అంతేకాదు తెలుగు లోనే తన సత్తా చాటేందుకు బాలీవుడ్ వైపు కన్నెత్తి చూడని హీరో గా పరిగణించవచ్చు.. ఇకపోతే టాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోలుగా గుర్తింపు పొందిన వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు.. ఈయన శ్రీమంతుడు సినిమా కు సంబంధించి సాక్షి అవార్డును అందుకోవడానికి వెళ్ళినప్పుడు, ఆ తర్వాత ఏకంగా ఆరు మంది దర్శకులతో భేటీ అయినట్లు సమాచారం..

మహేష్ బాబు ఇటీవల నటిస్తున్న సర్కారు వారి పాట దర్శకుడు పరశురామ్ బుజ్జీతో కొన్ని సినిమా సన్నివేశాల గురించి సమావేశమయ్యారు..ఇక అదే సమయంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ని కూడా కలిశారు. ఇక సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా కథ గురించి వివరణాత్మక చర్చలు జరుగుతున్నట్లు వినిపిస్తోంది.

అంతే కాదు..మహేష్ బాబు ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు.. గోపీచంద్ మలినేనిని తో కలిసి ఒకే చోట సాధారణం గా కలవాల్సి వచ్చిందట.. ఇక వీరే కాకుండా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా తో కూడా మహేష్ బాబు సమావేశం అయినట్లు, దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ గురించి మాట్లాడటానికి.. ఇప్పటి నుండి ఇంకొంత సమయం పడుతుంది అని చెప్పడానికి సందీప్ వంగా తో మాట్లాడినట్లు సమాచారం.. తదుపరి చిత్రాల గురించి మహేష్ బాబు ఈ 6 మంది డైరెక్టర్లతో సమావేశం అయ్యాడు అని సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.