సరికొత్త నేపథ్యంలో బాలయ్య మూవీ.. తాజా అప్డేట్ ఇదే..!

నందమూరి బాలకృష్ణ తన 107వ సినిమాగా యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. గోపీచంద్ మలినేని తాజాగా
క్రాక్ వంటి మాస్ మసాలా సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇంతకంటే హై రేంజ్ లో బాలకృష్ణను చూపించాలని గోపీచంద్ ప్రయత్నిస్తున్నారు.

ఈ సినిమాలో యాక్షన్ అంశాలతో పాటు ఎమోషనల్ డ్రామా కూడా ఉంటుందని తెలుస్తోంది. అలాగే కామెడీ కూడా పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. క్రాక్ సినిమా మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నప్పటికీ మూవీ లో ఎంటర్ టైన్ మెంట్ మిస్ అయిందనే విమర్శలు వచ్చాయి. ఈసారి యాక్షన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా తగినపాళ్ళలో ఉండేలా గోపీచంద్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

బాలకృష్ణ హీరోగా నటించిన చాలా హిట్ సినిమాలు రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కాయి. అయితే గోపీచంద్ సినిమా రాయలసీమ- కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. కథలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి ఉందని.. అది ఈ సినిమాకి ఎంతో కీలకమని టాక్. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం పైనల్ స్టేజ్ లో ఉంది. ఇది కంప్లీట్ కాగానే బాలయ్య- గోపీచంద్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.