రాసి పెట్టుకోండి..తడిచిపోవ‌డం ఖాయం అంటున్న శ్రీ‌విష్ణు!

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ‌విష్ణు తాజా చిత్రం `రాజ రాజ చోర`. మేఘా ఆకాశ్, సున‌య‌న ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించ‌గా.. హ‌సిత్ గోలి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకంపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగ‌ష్టు 19న థియేట‌ర్‌లో విడుద‌ల కాబోతోంది.

Sree Vishnu's next titled 'Raja Raja Chora'

ఈ నేప‌థ్యంలోనే ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో రాజ రాజ చోర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వించారు. అయితే ఈ ఈవెంట్‌లో హీరో శ్రీ‌విష్ణు చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఆయ‌న మాట్లాడుతూ.. ఈ సినిమా తెలుగు చిత్రం అని గర్వంగా చెప్పుకునేలా ఉంటుందని.. ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఆరు మాస్కులతో వెళ్లాలని.. నవ్వి నవ్వి ఫస్ట్ హాఫ్‏లో మూడు మాస్కులు ఎగిరిపోతాయని అన్నారు.

Sree Vishnu's 'Raja Raja Chora' to release on August 19; actor announces  with a new poster | Telugu Movie News - Times of India

ఇక సెకండ్ హాఫ్‏లో మీకు తడిచిపోవ‌డం ఖాయం. అలా మూడు మాస్కులు సెకండ్ హాఫ్‏లో తడవకపోతే నాకు చెప్పండి.. ఎంతలా నవ్విస్తామో అంతగా ఎడిపిస్తామని విష్ణు చెప్పుకొచ్చారు. రాసిపెట్టుకోండి ఈ సినిమా అన్ని భాషల వాళ్లు రీమేక్ కోసం అడుగుతారని.. సినిమా ఖ‌చ్చితంగా హిట్ అవుతుంద‌ని ధీమా వ్యక్తం చేశారు. మ‌రి మ‌న ఈ చోరుడి క‌థ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో తెలియాలంటే.. ఆగ‌ష్టు 19 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.