టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు తాజా చిత్రం `రాజ రాజ చోర`. మేఘా ఆకాశ్, సునయన ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించగా.. హసిత్ గోలి దర్శకత్వం వహించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 19న థియేటర్లో విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో రాజ రాజ చోర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వించారు. అయితే ఈ ఈవెంట్లో హీరో శ్రీవిష్ణు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారాయి. ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా తెలుగు చిత్రం అని గర్వంగా చెప్పుకునేలా ఉంటుందని.. ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఆరు మాస్కులతో వెళ్లాలని.. నవ్వి నవ్వి ఫస్ట్ హాఫ్లో మూడు మాస్కులు ఎగిరిపోతాయని అన్నారు.
ఇక సెకండ్ హాఫ్లో మీకు తడిచిపోవడం ఖాయం. అలా మూడు మాస్కులు సెకండ్ హాఫ్లో తడవకపోతే నాకు చెప్పండి.. ఎంతలా నవ్విస్తామో అంతగా ఎడిపిస్తామని విష్ణు చెప్పుకొచ్చారు. రాసిపెట్టుకోండి ఈ సినిమా అన్ని భాషల వాళ్లు రీమేక్ కోసం అడుగుతారని.. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. మరి మన ఈ చోరుడి కథ ఎంత వరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే.. ఆగష్టు 19 వరకు వెయిట్ చేయాల్సిందే.