సింగర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న రామ్ చరణ్ ..!

రామ్ చరణ్ చిరుత సినిమాతో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, రెండవ సినిమా రాజమౌళి దర్శకత్వంలో మగధీరతో రాత్రికి రాత్రే ఒక క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు మగధీర సినిమాతో రామ్ చరణ్ సాధించిన కలెక్షన్లను ఇప్పటి వరకు ఏ హీరో కూడా సాధించలేకపోతున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు తన 14 వ సినిమా అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో గా ఎదిగాడు రామ్ చరణ్..

ఇంత తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా ఎదగడం అంటే అది మామూలు విషయం కాదు. ఇక రామ్ చరణ్ లో ఉన్న టాలెంట్ ను చూస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే. రామ్ చరణ్ ఒక నటుడు మాత్రమే కాదు.. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కూడా. ఇప్పుడు సరికొత్తగా సింగర్ అవతారం ఎత్తడానికి సిద్ధమవుతున్నాడు.అది ఎక్కడో ..? ఏమిటో..? అనే పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పూర్తి వివరాల్లోకి వెళితే , జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో కి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షో కర్టెన్ రైజర్ ఆగస్టు 22 2021 వ తేదీ రాత్రి ప్రసారం కాగా ఇందులో రామ్ చరణ్ గెస్ట్ గా హాజరయ్యి, తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.

ఇక ఈ షో లో భాగంగానే రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా నుంచి సిడ్నీ నగరం అనే సాంగ్ ని పాడి వినిపించాడు. అద్భుతంగా పాడారు.. అని ప్రశంసలు కురిపించిన ఎన్టీఆర్ , త్వరలోనే ఒక సినిమాలో కూడా పాడాలని కోరారు. అందుకు …oఖచ్చితంగా అవకాశం వస్తే పాడతానని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు