పవన్ పై ప్రశంసల వర్షం కురిపించిన వుండవల్లి..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీ ఎంత గొప్ప నటులో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈయన రాజకీయం వైపు కూడా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ ను మాత్రం ప్రజలు సీఎం చేయలేకపోయారు. ఇక ప్రస్తుతానికి రాజకీయాలలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్.. పవన్ కళ్యాణ్ పై తన మనస్సులోని మాటను వ్యక్తం చేశారు. ఆ విషయం ఏంటో చూద్దాం.

ఇందులో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై, ఉండవల్లి గారు ప్రశంసల వర్షం కురిపించారు. 2019 లో జరిగిన సర్వే ఎన్నికల ప్రకారం, జనసేన పార్టీ పరిచయం అయిన తర్వాత పవన్ వెనుకంజ వేయకుండా రాజకీయాల్లోనే పోరాడుతూ ఉన్నాడని అందుకు ఆయన మెచ్చుకోవచ్చని చెప్పుకొచ్చాడు ఉండవల్లి అరుణ్ కుమార్.

ఇక రాజకీయాల్లో కొనసాగాలంటే డబ్బు, పలుకుబడి, అభిమానం అన్నీ ఉండాలని, అందుచేతనే ఆయన మళ్లీ సినిమాల వైపు అడుగు పెట్టి డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇక 2019 వ సంవత్సరం లో రెండు చోట్ల నిలబడి ఓడిపోయాడని తెలియజేశారు. అది కూడా అతి తక్కువ శాతం తో ఓడిపోవడంతో పవన్ కళ్యాణ్ ఏడస్తూ ఇంట్లో కూర్చుంటాడు అనుకున్న.. నాకు తెలిసి ఎవరైనా అదే పని చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అలాకాకుండా జనాల్లోకి వచ్చి తిరుగుతూ ఉన్నాడు.

తాను ఓడిపోయినా జనాల్ని విడిచిపెట్టనని ఆనాడు చెప్పిన మాట కోసం ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నారని తెలియజేశారు ఉండవల్లి. ప్రజల కోసం ఎన్నిసార్లైనా, ఎక్కడికైనా వస్తా అని, పవన్ కల్యాణ్ ఒకానొక సందర్భంలో తెలియజేశారు. ఉండవల్లి గతంలో కూడా ఇలాంటి ప్రశంసల వర్షం కురిపించాడు పవన్ కళ్యాణ్ మీద. పవన్ కళ్యాణ్ ఒక నిజాయితీపరుడైన తన పని తాను చేసుకుంటూ వెళ్తాడని తెలియజేశారు. కానీ అలాంటి వ్యక్తి ఓడిపోవడం జనాల దురదృష్టమని ఆయన తెలిపారు.