ప్రముఖ నటి పవిత్రా లోకేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు, కన్నడ చిత్రాల్లో సహాయక పాత్రలు పోషిస్తూ.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుందీమే. అయితే తాజాగా పవిత్రా లోకేశ్ను ఆమె మేనేజర్ దారుణంగా మోసం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివారల్లోకి వెళ్తే..
ఆమె మేనేజర్ జీఎస్టీ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడట్టు తెలుస్తోంది. దాదాపు 60 లక్షలకు పైగా జీఎస్టీ చెల్లింపులు చేయలేదని.. దీంతో ప్రభుత్వం నుంచి పవిత్రా లోకేశ్కు నోటీసులు అందాయని..ఇక నోటీసులు వచ్చే వరకు ఆమెకు అసలు సంగతి తెలియలేదని వార్తలు నెట్టింట వైరల్గా మారాయి.
కాగా, గతంలో సినీ సెలబ్రిటీలు ఎందరో ఇటువంటి మోసాలకు గురయ్యారు. మేనేజర్లను గుడ్డిగా నమ్మి కోట్లు కోల్పోయిన సెలెబ్రిటీలు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్ట్లో పవిత్రా కూడా చేరినట్టు టాక్ నడుస్తోంది.