సోదరితో సినిమాకు సిద్ధమైన మహేష్ బాబు.. త్వరలోనే ప్రకటన?

మహేష్ బాబు తన సినీ కెరీర్ లో సరైన సక్సెస్ కోసం ఎదురుచూసిన తరువాత భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు, మహర్షి లాంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ లను అందుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాను చేస్తున్నాడు. ఇందులో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం సినీ ఇండస్ట్రీ నుంచి మరొక వార్త వినబడుతోంది. అదేమిటంటే మహేష్ బాబు తన సోదరి మంజుల తో ఇందిరా ప్రొడక్షన్స్ పై ఒక సినిమాలో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మహేష్ సోదరి మంజుల ఇప్పటికే పలు రకాల సినిమాలలో నటించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె సినీ ఇండస్ట్రీకి దూరం అయింది. ఈమె గతంలో మహేష్ బాబుతో కలసి నాని సినిమా తీయగా అది ఫ్లాప్ అయ్యింది. అలాగే పూరి జగన్నాథ్ తో కలిసి నిర్మించిన పోకిరి సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈసారి మాత్రం మరీ ఇంత భారీ స్థాయిలో మహేష్ బాబు తో ఆమె సినిమా నిర్మించనున్నారని, తన కెరీర్ కీ బ్రేక్ ఇచ్చేలా ఆమె ఈ మూవీ కోసం మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే గనుక నిజమైతే మహేష్ అభిమానులుపండగ చేసుకోవచ్చు.