చిత్ర సీమలో ఈ మధ్య కాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నామధ్య కరోనా సమయంలో ఎంతో మంది చనిపోగా, వారి కుటుంబాలకు తగినంత సహాయాన్ని ఆ చిత్ర పరిశ్రమ చేయడం వంటివి జరుగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా తమిళ చిత్ర సీమలో కూడా ఒక విషాదం చోటుచేసుకుంది.
ఆరంభంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు ఆనంద్ కణ్ణన్. ఇక సోమవారం రాత్రి మృతి చెందడం జరిగింది. నేను గత కొన్ని నెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశాడు.
తమిళియన్ అయిన ఆనంద్ 90వ దశకంలో కోలీవుడ్ ప్రేక్షకులకు ఫేవరెట్ నటుడిగా మారి పోయారు. ఇక ఈయన టీవీ సిరీస్ లో సింధ్ బాధ్ లో లీడ్ రోల్ ద్వారా పిల్లలకు, యువతకు బాగా దగ్గరయ్యాడు. అయితే వారం క్రితం హఠాత్తుగా ఆరోగ్య సమస్యలతో ఈయన ఆరోగ్యం విషమించడంతో ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశాడు. ఈయన మృతి చెందడంతో తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.
మరి కొంతమంది ఒక మంచి నటులను మిస్ అయ్యాము అని పలువురు సెలబ్రిటీలు తెలియజేశారు