పాయల్‌తో ఆది సినిమా.. ఉందా ఊడిందా?

టాలీవుడ్ డైలాగ్ కింగ్ సాయి కుమార్ నటవారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో ఆది సాయి కుమార్ తొలిసినిమాతోనే ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఆ తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తున్న ఈ హీర స్టార్‌డమ్‌ను మాత్రం అందుకోలేకపోయాడు. అయితే చేసిన ప్రతి సినిమాలో కొత్తదనం చూపించేందుకు ప్రయత్నిస్తూ ప్రేక్షకుల మన్ననలను పొందుతూ వస్తున్నాడు.

కాగా ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టిన ఈ హీరో, ఇటీవల అందాల భామ పాయల్ రాజ్‌పుత్‌తో మరో సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఆ సినిమాకు ‘కిరాతక’ అనే టైటిల్‌ను కూడా పెట్టారు చిత్ర యూనిట్. అయితే ఆ సినిమాను ఇప్పుడు పక్కనబెట్టి మరీ మరోసారి అదే కాంబినేషన్‌ను రిపీట్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. అయితే ‘కిరాతక’ చిత్రం గురించి ప్రస్తుతం జనం చర్చించుకుంటున్నారు.

ఒక సినిమాను అనౌన్స్ చేసిన తరువాత ఆ సినిమా ఎక్కడివరకు వచ్చిందో చెప్పకుండానే, మరో సినిమాను అనౌన్స్ చేయడం ఏమిటని వారు అంటున్నారు. అయితే ఆ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తికాలేదని, దీంతో నటీనటుల డేట్స్ విషయంలో తేడాలు వస్తాయని భావించిన చిత్ర నిర్మాత, వారితో మరో సినిమాను వెంటనే ప్రారంభించాడని సినీ వర్గాలు అంటున్నాయి. అయితే మరి ‘కిరాతక’ అనే సినిమా ఉంటుందా లేదా అనే విషయంపై మాత్రం చిత్ర యూనిట్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.