ఆచార్యకు అదిరిపోయే ఆఫర్.. ఒప్పుకుంటాడా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ కేవలం ఒకట్రెండు పాటల మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు కొరటాల తనదైన మార్క్‌తో తీర్చిదిద్దడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేస్తారనే ప్రచారం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఆ విషయాన్న పక్కనబెడితే, ప్రస్తుతం ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ విషయంలో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం తీవ్ర పోటీ నెలకొనగా ప్రముఖ ఛానల్ స్టార్ మా ఈ సినిమాకు ఓ ఫ్యాన్సీ రేటును ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రేటుకు చిత్ర నిర్మాతలు కూడా కన్విన్స్ అయితే, ఈ సినిమా శాటిలైట్ రైట్స్ స్టార్ మా వశం కావడం ఖాయమని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

కమర్షియల్ అంశాలతో పాటు సామాజిక అంశాలను పుష్కలంగా కలిగిన ఆచార్య మరి స్టార్ మా వారికి అమ్ముడవుతాడా లేడా అనేది చూడాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, పూజా హెగ్డే ఓ కేమియో పాత్రలో నటిస్తోంది.