టాలీవుడ్ లో 2017 లో డ్రగ్స్ వ్యవహారంలో సెన్సేషన్ సృష్టించిన సంగతి నాలుగేళ్ల క్రితంది. కానీ ఇప్పుడు ఇది తెర ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ కేసులలోకి ఈడీ రంగంలోకి వచ్చింది. తెలంగాణ ఎక్సైజ్ అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ డ్రగ్ కేసును మాత్రం ఈడికి అప్పగించింది. ఎక్సైజ్ శాఖకు చెందిన అధికారులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఆధారంగా ఇప్పుడు మనీల్యాండరింగ్ నిరోధక చట్టం,(పీఎంఎల్ఏ) కింద కేసులు నమోదు చేశారు.
ఇందులో భాగంగా ఆరోపణలు ఎదురుకున్న 10 మంది సినీ ప్రముఖులతో సహా 12 మందికి ఈడీ నోటీస్ లు జారీ చేసింది. టాలీవుడ్ కు చెందిన పూరి జగన్నాథ్, రానా దగ్గుబాటి,రకుల్ ప్రీతిసింగ్, చార్మి , రవితేజ, ముమైత్ ఖాన్, తరుణ్, తనుష్, రవితేజ, నందు , ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ లను ఈడీ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. వీరందరినీ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు ఈడీ విచారిస్తుంది.
ప్రస్తుతం మీడియా ప్రకారం ఈ కేసును ఈడి ఎప్పుడెప్పుడు ఎవరెవరిని విచారిస్తుంది. అంటే
ఆగస్టు 31 – పూరి జగన్నాథ్
సెప్టెంబర్ 2 – ఛార్మి కౌర్
సెప్టెంబర్ 6 – రకుల్ ప్రీత్ సింగ్
సెప్టెంబర్ 8 – రానా దగ్గుబాటి
సెప్టెంబర్ 9 – రవితేజ
సెప్టెంబర్ 9 – శ్రీనివాస్ (రవితేజ డ్రైవర్)
సెప్టెంబర్ 13 – నవదీప్
సెప్టెంబర్ 13 – ఎఫ్ క్లబ్ జీఎం
సెప్టెంబర్ 15 – ముమైత్ ఖాన్
సెప్టెంబర్ 17 – తనీష్
సెప్టెంబర్ 20 – నందు
సెప్టెంబర్ 22న తరుణ్
2017 లో జూలై 2న హైదరాబాదులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిని ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో సినీ ప్రముఖులు డ్రగ్స్ విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో 12 మంది పై కేసులు నమోదు కాగా , మరో 11 కేసులు దర్యాప్తు చేశారు. అయితే ఇందులో టాలీవుడ్ ప్రముఖులు ఎవరిని కూడా నిందితులుగా చేర్చలేదు. వీరందరిని ఈడి విచారిస్తున్నట్లు తెలుస్తోంది.