బుల్లెట్ బండి పాట పాడిన.. ఈమె ఎవరో తెలుసా..?

ఈ మధ్య కాలంలో జానపద గేయ పాటలు ఎక్కువగా వినిపిస్తూనే ఉన్నాయి. అది కూడా తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇవి ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. ఇక కొన్ని జానపద గేయాలు కూడా కొంతమంది సింగర్ లు ప్రత్యేకంగా వాటికోసమే పుట్టారు అన్నట్లుగా పాడుతున్నారు. అలాంటి పాటలు మంగ్లీ కూడా ఎన్నో పాడింది. అయితే ప్రస్తుతం ఒక పాట జనాలను బాగా విపరీతంగా ఆకట్టుకుంటోంది..

ప్రస్తుతం ఎవరి నోటైనా సరే ఎక్కువగా”బుల్లెట్ బండి ఎక్కి వస్తావా పా”అనే పాట ఎక్కడ చూసినా వినిపిస్తూనే ఉంది. ఇక ఇదే పాటకి తాజాగా ఒక పెళ్లి కూతురు కూడా స్టెప్పులేస్తూ ఉన్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇక దీంతో.. ఈ పాట పాడింది ఎవరు ..? రాసింది ఎవరు ..? అనే విషయాలను ప్రజలు తెలుసుకోవాలని ఎక్కువగా ఆత్రుత పడుతున్నారు. అయితే వారి కోసం వీరి వివరాలను తెలియజేస్తున్నాం.Mohana Bhogaraju | Spotify

ఇక ఈ పాటని గాయని మోహన్ భోగరాజు పాడి, ఏప్రిల్ 7న యూట్యూబ్ లో విడుదల చేసింది. ఇక ఇప్పటికీ ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి మూడు కోట్లకు పైగా వ్యూస్, షేర్ చేసుకుంటున్నట్లు,అలాగే కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక ఈ పాట పాడిన ఆమె గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇక ఈమె బాహుబలి సినిమాలో కూడా మనోహర్ అనే పాటను కూడా పాడిందట. ఈ పాట తర్వాత ఆమెకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. అలా ప్రైవేట్ సాంగ్ లో కూడా పాడటానికి అవకాశాలు రావడంతో ఈమె వాటిని కూడా ఒప్పుకున్నది. ఈమెది హైదరాబాదేనట. ఇక బాహుబలి సినిమా కంటే ముందుగా ఈమె ఉదయ్ కిరణ్ సినిమాలో కూడా ఒక పాట పాడినా పెద్దగా ఫలితం రాలేదు.