బర్త్ డే స్పెషల్ : మనీషా కొయిరాలా గురించి ఈ విషయాలు తెలుసా..?

ఈ నేపాలి భామ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.. ఆ భామ ఎవరో కాదు. మనీషా కొయిరాలా..ఈమె నేపాల్ రాజ్యానికి చెందిన అమ్మాయి. తను చిన్నప్పటినుంచి కలల రాకుమారి గా ఉండేది. ఈమె చేయని పని అంటూ ఏమీ లేదు.. అంతేకాకుండా ఈమె మోడలింగ్ లో కూడా రాణించింది ఈమె బాలీవుడ్ లో సౌదాగర్ అనే సినిమా ద్వారా అడుగు పెట్టింది. ఈ సినిమాను దర్శకుడు సుభాష్ తెరకెక్కించాడు. ఈమె 2010లో సామ్రాట్ దాహాల్ ను పెళ్లి చేసుకుంది. రెండేళ్లకి..ఆ పెళ్లి పెటాకులైంది. ఆ తరువాత ,ఆమె క్యాన్సర్ వ్యాధికి గురయ్యింది. ఆమె ఎంతో ఆత్మ విశ్వాసంతో క్యాన్సర్ ను పోరాడింది కూడా.. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ చిత్రాల్లోకి సంజూ సినిమా ద్వారా అడుగు పెట్టింది. గత మూడు సంవత్సరాల కిందట విడుదలైన ఈ చిత్రంలో రన్బీర్ కపూర్ హీరో గా నటించారు. ఇక ఈ సినిమాలో ఒక తల్లి పాత్రలో నటించింది మనీషా..

 1960 ఆగష్టు 16న నేపాల్ రాజకుటుంబంలో జన్మించిన మనీషా కొయిరాల. ఆ తర్వాత మోడలింగ్‌లో అడుగుపెట్టింది.1989లో నేపాలీ భాషలో తెరకెక్కిన ‘ఫేరీ బేతాళా’ మూవీతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది.

ఈమె నేపాల్ రాజకుటుంబానికి చెందినది.ఈమె డాక్టర్ కావాలని కన్న కలలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి. ఇక ఆమె అనుకున్నది జరగకపోవడంతో మోడలింగ్ లోకి దూసుకుపోయింది.మనీషా కొయిరాలా 1960 లో రాజ కుటుంబంలో జన్మించిన ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఆమె ఎన్నో రంగాలలో పని చేసింది. తెలుగులో మహేశ్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘క్రిమినల్’ మూవీతో దక్షిణాదిలో అడుగుపెట్టింది

హీరోయిన్ గా ఈమెకు మంచి క్రేజ్ ఇచ్చిన చిత్రం 1942 ఏ లవ్ స్టోరీ.. టాలీవుడ్ లో నాగార్జున సినిమా లో క్రిమినల్ మూవీ లో దక్షిణాదిలో అడుగుపెట్టింది. మన దర్శకుల్లో ఒకరైన మణిరత్నం మూవీ లో బాంబే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ మన టాలీవుడ్ సినిమాలలో ఎన్నో చిత్రాల్లో నటించింది. అందులో భారతీయుడు, ఒకే ఒక్కడు సినిమాల్లో తన నటనతో బీభత్సం సృష్టించింది.ఇక క్యాన్సర్ వ్యాధిని జయించి , వేరే సినిమాలతో బిజీగా ఉంది. ఈమె ఆరోగ్యం పూర్తిగా నయం కావాలని , ఎన్నో సినిమాలలో రాణించాలని ప్రేక్షకులు అనుకుంటున్నారు.