అమెజాన్‌ బంపర్ ఆఫర్…!

అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఇండిపెండెన్స్ డే సేల్ మన ముందుకు వచ్చేసింది. ఈ కామర్స్ రారాజు అయిన అమెజాన్ సరికొత్త ఆఫర్లతో ప్రజలకు చేరువవుతోంది. తాజాగా అమెజాన్ మొబైల్ సేవింగ్స్ సేల్ పేరుతో బంపరాఫర్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఆగస్టు 16వ తేది నుంచి 19వ తేదీ వరకు ఈ ఆఫర్ ఉంటుంది. ఈ సేల్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్ తో అమెజాన్ అందించనుంది. అంతేకాదు మరెన్నో ఆఫర్లను మీముందు ఉంచింది.

మొబైల్స్ పై ఎక్స్ చేంజ్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. ఒక సంవత్సరం వరకూ నో కాస్ట్ ఈఎంఐ ఉంది. వన్‌ప్లస్‌, షావోమీ, శాంసంగ్‌, ఐక్యూ, రియల్‌మీ కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్లపై 10 శాతం డిస్కౌంట్స్ ను అందించనుంది. ఎంఐ11 ఎక్స్ స్మార్ట్ ఫోన్ కొనుగోలులో ఎక్సేచేంజ్ పైన మరో రూ.5వేలు తగ్గింపును ఇస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ బంపరాఫర్లను వినియోగించుకుని మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసేయండి.