బ్రేకింగ్: భారత్ ఖాతాలో మరో ఒలంపిక్ పతాకం…!

ప్రస్తుతం జరుగుతున్న ఒలంపిక్స్ లో భాగంగా భారత్ కు మరో పతకం లభించింది. రెస్లింగ్ విభాగంలో భాగంగా నేడు కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత రెజ్లర్ బజరంగ్ పునియా విజయం సాధించడంతో భారత్ ఖాతాలో ఆరవ పతకం నమోదయింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో 65 కేజీల విభాగంలో కజకిస్తాన్ రెజ్లర్ నియోజ్ బెకొవ్ పై బజరంగ్ ఏకంగా 8 – 0 తేడాతో విజయకేతనం ఎగరేశాడు. ఈ మ్యాచ్ లో బజరంగ్ తన ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిక్యాన్ని కనపరిచాడు.

ఈ మెడల్ తో టోక్యో లో జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత దేశానికి రెండు వెండి పతకాలు, నాలుగు కాంస్య పతకాలు చేరాయి. నేడు జరిగిన గోల్స్ క్రీడలో భారత్ కు చెందిన క్రీడాకారిణి నాలుగో స్థానంలో నిలిచి పథకాన్ని త్రుటిలో చేజార్చుకుంది.