సినీ నిర్మాత, ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ అధినేత, పారిశ్రామికవేత్త వి. ఆనందప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిత్య అన్నదాన కార్యక్రమానికి రూ.కోటి విరాళం అందించారు.
సతీసమేతంగా బుధవారం స్వామిని దర్శించుకున్న ఆనందప్రసాద్.. అనంతరం టీటీడీ దేవస్థానం అడిషనల్ ఈవో ధర్మారెడ్డిని కలిసిన కోటీ రూపాయల చెక్ను అందించారు.
కాగా, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి పరమ భక్తుడైన ఆనంద ప్రసాద్.. టీటీడీకి గతంలోనూ రూ. కోటి విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే. 2015లో టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్స్ ట్రస్టుకు ఆ మొత్తాన్ని అందజేశారు.