ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి తగ్గుతూ వస్తోంది. గత కొద్ది రోజులుగా భారత్లోనూ కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి.
ఇక నిన్న కూడా కరోనా కేసులు, మరణాలు కిందకు దిగివచ్చాయి. గత 24 గంటల్లో భారత్లో 39,361 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,14,11,262 కు చేరుకుంది. అలాగే నిన్న 416 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 4,20,967 కు పెరిగింది.
ఇక నిన్న ఒక్కరోజే 35,968 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి 3,05,79,106 మంది హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 4,11,189 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఇక దేశవ్యాప్తంగా నిన్నొక్క రోజే 11,54,444 కరోనా టెస్ట్లు నిర్వహించారు అధికారులు.