కేంద్ర మంత్రి హర్షవర్ధన్ రాజీనామా..?

నేడు జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రాజీనామా చేశారు. దీంతో మొత్తం 7 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్, సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్ లు రాజీనామా చేసిన వారి లిస్ట్ లో ఉన్నారు.

ముఖ్యంగా అన్ని వర్గాలకు సంబంధించి సమతూకం చేయాలని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి ప్రయత్నిస్తున్నట్లు బీజేపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తాజాగా వెల్లిదించిన కొత్త మంత్రివర్గంలో మొత్తం 13 మంది న్యాయవాదులు, 6 మంది వైద్యులు, 5 మంది ఇంజనీర్లు ఉండబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉన్నత విద్యావంతులకు మోదీ ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో ముగ్గురు ఎస్టీలు, ఇద్దరు ఎస్సీలకు కేబినెట్ హోదా ఇవ్వబోతున్నట్లు సమాచారం. సహాయ మంత్రులు కిరణ్ రిజిజు, అనురాగ్ ఠాకూర్‌ లకు పదోన్నతి లభిస్తుందని సంచారం. అలాగే ప్రస్తుతం సహాయ మంత్రులుగా కొనసాగుతున్న ఏడుగురికి పదోన్నతి లభించే అవకాశం ఉందని జాతీయ మీడియా చెప్తోంది. ఇందులో భాగంగా తెలుగు వ్యక్తి కిషన్ రెడ్డి కూడా ఈ జాబితాలో ఉన్నారని సంచారం. ఈయనతో పాటు అనుప్రియ పటేల్‌కు మంత్రి పదవి లభించబోతున్నట్లు తెలుస్తోంది. కొత్త మంత్రులు లభించే వారు నేడు సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు అధికారిక సమాచారం.