టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణతో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్లో విడుదల కానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. అఖండ తర్వాత బోయపాటి ఏ హీరోతో సినిమా చేస్తాడు అన్న దానిపై ఆసక్తి నెలకొన్న తరుణంలో.. అల్లు అర్జున్, సూర్య, యష్, కళ్యాణ్ రామ్ ఇలా చాలా హీరోల పేర్లు వినిపించాయి.
కానీ, ఎవరితోనూ ఫైనల్ కాలేదు. అయితే ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ పేరు తెరపైకి వచ్చింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం..బోయపాటి ఓ ఫుల్ యాక్షన్ స్క్రిప్టును సిద్ధం చేసి.. ఇటీవల విశాల్ కు వినిపించాడట. అది బాగా నచ్చడంతో విశాల్ వెంటనే మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నారు.
ఈ సినిమా పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనుందట. అంతేకాదు, వీరి కాంబోలో తెరకెక్కబోయే చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారని తెలుస్తోంది. మరి ఇదే నిజమైతే.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన రానుంది.